*మల్యాల మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి*

మన సాక్షి గొంతుక ప్రతినిధి /మల్యాల
మల్యాల మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గణపతులను ట్రాక్టర్లో ఎక్కించేటప్పుడు గానీ గణపతులు నీటిలో నిమజ్జనం చేసేటప్పుడు గానీ ప్రక్కన గానీ, ముందుగానీ ఎవరు లేకుండా చూసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకొని నీటిలో నిమజ్జనంచేయగలరని, శోభయాత్రలో డీజేలు అనుమతి లేదు , మద్యం తాగి శోభయాత్ర నిర్వహించరాదు ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో ఇన్ని రోజులు పూజలు నిర్వహించుకున్నాము, అదే తరహాలో నిమజ్జనం కూడా నిర్వహించుకోవాలని తగు జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోగలరని, ఎలాంటి గొడవలు పడకుండా శాంతియుతంగా నిమజ్జనం చేసి పోలీసువారికి సహకరించగలరని ఎస్,ఐ నరేష్ కుమార్ కోరారు.

