స్వార్థం కోసమే కొమ్మూరి ప్రతాపరెడ్డి పై ఆరోపణలు

నియోజక వర్గ కిసాన్ కో ఆర్డినేటర్ శ్రీ జంగిటీ నరేష్ కుమార్
మన సాక్షి గొంతుక/బచ్చన్నపేట మండలం
గత కొన్ని రోజులుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి రాజకీయ స్వార్థం కోసం నియోజకవర్గంలో వారి పెత్తనం కోసం పని కట్టుకొని అపర భగీరథుడు, ప్రజా సేవకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మీద బురద చల్లుతున్నారు .ఇది ముమ్మాటికి అవాస్తవం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్ర నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం, అట్లాంటి వ్యక్తి పైన గత అసెంబ్లీ ఎన్నికల్లో తృటిలో ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ప్రతాప్ రెడ్డి కి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు ఆరోపణలు చేస్తున్నారు, ఆయన యొక్క హుందాతనాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు, వీరి యొక్క స్వార్థ రాజకీయాలు ఎక్కువ రోజులు నిలువని నియోజకవర్గ కిసాన్ కోఆర్డినేటర్ జంగిటి నరేష్ పేర్కొన్నారు .మరియు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ని ఏ ఒక్కరోజు ప్రశ్నించని సీనియర్ నాయకులు, కోట్లాది రూపాయల నిధులు తెచ్చి చేర్యాల, జనగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రతాప్ రెడ్డి ని విమర్శించడం పనికిమాలిన చర్యగా వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.

