షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన
హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
*విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, భీష్మ కిష్టయ్య, బక్కని నరసింహులు*
మన సాక్షి గొంతుక / రంగారెడ్డి జిల్లా బ్యూరో
షాద్ నగర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, భీష్మ కిష్టయ్య, బక్కని నరసింహులు, కేశంపేట మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో దాతల సహకారంతో భవన నిర్మాణానికి పునాది వేయబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




