హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

మన సాక్షి గొంతుక /మల్యాల ప్రతినిధి
మల్యాల* మండలం కేంద్రానికి చెందిన *మన నేస్తం హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సభ్యులు గంగిశెట్టి రాజేశం తండ్రి హన్మయ్య ఇటీవల అనారోగ్యానికి గురై మృతి* చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న *మన నేస్తం హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ తెలంగాణ వ్యవస్థాపకులు కిసరి గణేష్{ఆర్మీ} సంతాపం తెలుపుతూ *మన నేస్తం హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ తెలంగాణ* సభ్యుల సహకారంతో సమకూర్చిన *డబ్బులు 5,000/- రూపాయలను వారి సొంత గ్రామమైన కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి గ్రామానికి వెళ్లి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జా నర్సయ్య మాట్లాడుతూ మన నేస్తం హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ తెలంగాణ ద్వారా జిల్లాలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని సేవ చేయాలానే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ లో మమేకం చేసుకొని ముందుకు వెళుతున్నాం అని అదేవిదంగా సేవ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని మా ఫౌండేషన్ ఆహ్వానిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మ్యాదరి లవన్, బొజ్జ నర్సయ్య,గుర్రం శ్రీధర్ గౌడ్, కోరేపు వెంకటేష్, కట్కమ్ వినయ్, సామల రవి, పొనగంటి గౌతమ్,కొలిపాక భరత్, ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు…

