దైవభక్తి చాటుకున్న మాజీ సర్పంచ్

గుడికి విరాళంగా లక్ష రూపాయలు అందజేత
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, కేసిరెడ్డిపల్లి గ్రామంలో మహంకాళిమ్మ గుడి నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళంగా మాజీ సర్పంచ్, జనగామ కౌన్సిలర్ దివ్య అరవింద్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి గుడి నిర్మాణానికి తన వంతు విరాళంగా అందించడం తనకు సంతోషంగా ఉందని రోజుల్లో గ్రామ అభివృద్ధికి మరింత సహకారం అందించడానికి ముందుంటానని తెలియజేశారు. సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ గుడి నిర్మాణానికి సహాయం అందించిన దివ్య అరవింద్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేందర్, వెంకటాచారి, సిద్ధులు, రాజమౌళి ,చంద్రమౌళి, సోములు, సిద్ధులు, సంధ్య, వెంకటాద్రి, చంద్రమౌళి, భాను, వినోద్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

