కరెంట్ షాక్ తో వృద్ధురాలు మృతి…

మన సాక్షి గొంతుక/బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, ఆలింపూర్ గ్రామంలో వృద్ధురాలు కరెంట్ షాక్ కు గురై చనిపోయారు. వివరాల్లోకి వెళితే ఆలింపూర్ గ్రామానికి చెందిన జ్యోతి అంజమ్మ ఇంటిలో వాటర్ మోటార్ యొక్క వైరు తగిలి కరెంట్ షాక్ కు గురై వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆస్పత్రికి వెళ్లి జ్యోతి భాస్కర్ నీ పరామర్శించారు.

