అధిక దిగుబడులకు లక్ష్మీ సీడ్స్ వారి ‘లక్ష్మీ-సిక్క’ హైబ్రిడ్ మొక్కజొన్న

— క్షేత్ర ప్రదర్శన లో కంపనీ మేనేజర్ గంగా రెడ్డి
మన సాక్షి గొంతుక న్యూస్/రాజన్న సిరిసిల్ల:
రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రములోని ముస్కానిపేట గ్రామానికీ చెందిన రైతు గుర్రం రవీందర్ రెడ్డి లక్ష్మీ సీడ్స్ వారు నూతనంగా ఉత్పత్తి చేసి,రైతులకు అందచేసినటువంటి లక్ష్మీ-సిక్క అనే సంకరజాతి మొక్కజొన్న విత్తనాణ్ణి తన 6 ఆరు ఎకరాల పొలంలో యాసంగి(రబీ) పంటగా నాటుకోవటం జరిగింది.ఈ మొక్కజొన్న విత్తనాల గురించి కంపనీ మేనేజర్ గంగా రెడ్డి మాట్లాడుతూ,ఈ లక్ష్మీ-సిక్క విత్తనాలు నాటుకుంటే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఈ రకంలో ప్రతీ మొక్కజొన్న కండెకి 16 నుండి 18 వరుసలు కలిగిఉండి,అధిక బరువుతో కూడిన మంచి ముదురు నారింజ రంగు గింజలు,అధిక రోగనిరోధక శక్తి వుండడంవలన రైతులకు పురుగుమందు పిచికారీ ఖర్చు చాలా తక్కువ తద్వార అధిక దిగుబడి మంచి మార్కెట్ ధర ఇలాంటివిశిష్ట లక్షణాలను వివరించారు.ఈ క్షేత్రస్థాయి ప్రదర్శనలో బెజ్జంకి,ఇల్లంతకుంట మరియు సిరిసిల్ల మార్కెట్లకు చెందిన విత్తనడీలర్లు అలాగే చుట్టు పక్కల 5 గ్రామాల రైతులు సుమారు 250 మందికి పైగా హాజరుకావడం జరిగింది.

