పచ్చని కొండల్లో ఏరులై పరిన రక్తం….
హిందువులను హత మత మార్చడం యావత్ మానవాళిని కలవరపరిచింది….

బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం
ప్రజా గొంతుక /మల్యాల
జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో ఉగ్రవాదులు 27 మంది హిందువులను హతమార్చడం యావత్ మానవాళిని కలవరపరిచిందని బిజెపి మల్యాల మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం అన్నారు. జమ్మూకశ్మీర్ లో అమాయక టూరిస్టులను హతమార్చడం ద్వారా టెర్రరిస్టులు మరోసారి తమని తాము పిరికిపందలని నిరూపించుకున్నారు. కశ్మీరు ప్రకృతి అందాలను తిలకించేందుకు వెళ్లిన అమాయక పర్యాటకులు ఉగ్రవాద తూటాలకు బలికావడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. ఉగ్రవాద ముష్కరులు హిందువులనే టార్గెట్ చేసి హతమార్చడం ద్వారా వారి అజెండా ఎంటో, వారి ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పారు. గతంలో ఔరంగజేబు వంటి పాలకులు, రజాకార్లు ఉద్దేశపూర్వకంగా హిందువులపై దాడి చేస్తే ఇపుడు టెర్రరిస్టులు హిందువులను ఎంపికచేసుకుని మరీ హతమారుస్తున్నారు. ఉగ్రవాదుల లక్షిత దాడులను ఎదుర్కొనేందుకు హిందువులంతా ఐక్యంగా ఉండాలి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అవలంభించిన హిందూ వ్యతిరేక, ముస్లిం అనుకూల వైఖరి, అమలు చేసిన కశ్మీరుకు స్వతంత్రప్రతిపత్తి విధానం వల్లే అక్కడ ముస్లిం టెర్రరిజం వేళ్లూనుకుంది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా మోదీ సర్కారు కశ్మీరులో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు చేస్తున్న కృషికి యావత్ భారత దేశం పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంల�

