మూసుగేసికొని పడుకున్న మోటర్లు…
రైతుల పాలిట శాపాలు…
బొమ్మకూర్ రిజర్వాయర్లో అన్ని మోటర్లు ఆన్ చేయండి
సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
గత 15 రోజుల నుండి మోటార్ల కు ముసుగేసి ఉండడంతో, రైతుల పాలిట శాపంగా మారిందని బచ్చన్నపేట మండల సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు.బొమ్మకూర్ రిజర్వాయర్ గోదారినీలతో నిండుకుండల ఉన్నప్పటికీ తపస్ పల్లికి నీళ్లను తరలించే విద్యుత్ మోటర్లు పూర్తిస్థాయిలో పంపింగ్ చేయడంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు .ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బొమ్మకూర్ రిజర్వాయర్ ను సందర్శించారు .అనంతరం వారు మాట్లాడుతూ థర్డ్ పేస్ లో రెండు మోటార్లు ఉంటే ఒక మోటర్ మాత్రమే నడుస్తుందని, రెండవ పేస్ లో రెండు మోటర్లు ఉన్న ఆన్ చేయడం లేదని అన్ని మోటర్లు ఆన్ చేస్తే తపస్ పల్లికి పంపింగ్ ఎక్కువగా నడిచి నీళ్లు కాలువల ద్వారా పలు గ్రామాలలో చెరువులు కుంటలు నింపే అవకాశం ఉన్న నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లను అదేవిధంగా తరలించడం జరిగిందని నేడు అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. వర్షపాతం తక్కువ ఉండి ఎంతైనా ప్రాంతం గా ఉన్న జనగామ నియోజకవర్గం లో అన్ని చెరువులు నిండాలి అంటే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. నారు పోసి నాట్లు వేసి నీళ్లు లేక పొలాలు ఎండుతున్నాయని రైతుల కోసం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా పూర్తిస్థాయిలో మోటర్లు ఆన్ చేసి నీళ్లు పంపింగ్ చెయ్యాలని కోరారు.