డిసిసి మార్పుతో కార్యకర్తల్లో నూతన జోష్….

డిసిసి అధ్యక్షురాలకు శుభాకాంక్షలు
కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కళ్లెం రమేష్…
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా డిసిసి అధ్యక్షురాలుగా నియమితమైన లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ ను చిన్న రామచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కళ్లెం రమేష్ శైలజ దంపతులు కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో గ్రామంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తలను గుర్తించాలని, గుర్తించినప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని వారికి తెలియజేశామని అన్నారు. డిసిసి మార్పుతో కార్యకర్తల్లో నూతన జోష్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాఎడుమల రాంరెడ్డి,యావళ్ల అంజి భాగ్య, కంతి రవి భాగ్య, సీనియర్ నాయకులు నూనె ముందల బాపు గౌడ్, డీలర్ మంగళపల్లి శీను, మండల లోజు కృష్ణమూర్తి , తదితరులు పాల్గొన్నారు.

