పదవతరగతి పరీక్షా కేంద్రాల వద్ద షి టీమ్స్ డెకాయ్ ఆపరేషన్.
విద్యార్థినులను వేదిస్తున్న 22 మంది ఆకతాయిల పట్టివేత

మన సాక్షి గొంతుక /రామగుండం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేదిస్తున్న 22 మంది ఆకతాయిలను షి టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి వద్ద నుండి 10 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకుని, వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 13 మంది మేజర్స్ పై కేసులు నమోదు చేసి 09 మంది మైనర్లకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్చరించారు.
ఎవరైన విద్యార్థినులను ఆకతాయిలు వేధింపులకు గురైనట్లయితే వెంటనే డయల్ 100,రామగుండం షీ టీం నెంబర్ 6303923700,
ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సమాచారం అందజేయండి

