మద్దూర్ మండల కాంగ్రెస్ పార్టీ ,అధ్యక్షుడిగా మేకమల్లేశం

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ మద్దూర్ మండలం
సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గం మద్దూర్ మండల అధ్యక్షుడిగా గాగిల్లపురం కాంగ్రెస్ సీనియర్ మేకమల్లేశం నునియమిస్తూ ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్డర్ పత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మేకమల్లేశం మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డికి ,సీఎం రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లకుప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీ గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలియజేశారు.

