నిందితులను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

మన సాక్షి గొంతుక ప్రతినిధి/బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోనిపడమటి కేశవపూర్ గ్రామానికి చెందిన రైతు కొమ్మాట రఘుపతి ఆత్మహత్య చేసుకున్న కేసులో బచ్చన్నపేట మండల సర్వేయర్ కుక్క రవీందర్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ అతనికిరిమాండ్ విధించడం జరిగింది.ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు కొనసాగుతుంది అని బచ్చన్నపేట ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు.

