మాంసం ప్రియులకు బిగ్ షాక్..
కొండెక్కిన చికెన్ ధరలు కేజీ ఎంతంటే?

మన సాక్షి గొంతుక న్యూస్ డెస్క్ హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో కొందరు వారానికి రెండు మూడు సార్లు అయినా మాంసం , తిననిది ఉండలేరు . అయినప్పటికీ ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు ఉంటారు.కొందరు వారానికి రెండు మూడు సార్లుఅయినా మాంసం ముట్టనిదే ఉండలేరు. గత నాలుగైదు రోజుల నుండి మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాకిచ్చాయి. అమాంతం ఒకేసారి భారీగా పెరిగి.. ఆందోళనకు గురి చేస్తున్నాయి. వారం క్రితం వరకు కేజీ చికెన్ రూ. 200 ఉండగా, ఇప్పుడు సుమారు రూ.100 పెరగడంతో రూ. 270 నుండి 300 వారకు చేరుకుంది.ఎండలకు కోళ్లు చనిపోతున్న నేపథ్యంలోనే రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఎండాకాలం అయిపోయే వరకు ధరలు ఇలాగే కొనసాగనున్నట్లు విక్రయదారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన మాంసం ప్రియులు, సామాన్య ప్రజలు కష్టమైనప్పటికీ కూరగాయల భోజనం చేయడమే ఉత్తమం అని అంటున్నారు.

