మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సాహస సర్పంచ్
సొంత గూటికి చేరిన పడమటి కేశ్వాపూర్ తాజా మాజీ సర్పంచ్ గిద్దేల రమేష్

మన సాక్షి గొంతుక ప్రతినిధి/ బచ్చన్నపేట మండలం
దళిత సామాజిక వర్గంలో యువతలో మంచి క్యాడర్ కలిగిన వ్యక్తి గిద్దల రమేష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ సాహస సర్పంచ్ , గిద్దెల రమేష్ నేడు సొంతగూటికి చేరుకున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశపురం గ్రామా మాజీ సర్పంచ్ గిద్దేల రమేష్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో వారి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి , చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి తన వంతు కృషి చేస్తానని ,పార్టీ బలోపేతానికి ముందు ఉంటానని తెలియజేశారు.

